మన తెలంగాణ, హైదరాబాద్ : అగ్నిప్రమాదంలో పూరిగుడెస కాలిపోయి రోడ్డుపాలైన పేద కుటుంబానికి ట్రాన్స్కో,జెన్కో సిఎండి దేవుల పల్లి ప్రభాకర్రావు సహకారంతో గృహనిర్మాణం చేపట్టారు. మార్చిలో లాక్డౌన్ ప్రారంభమైన తొలిరోజుల్లో నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరుగ్రామానికి చెందిన రోమన్ గుడిసె పూర్తిగాకాలిపోయింది. రోమన్ దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ విషయాన్ని అప్పట్లో గ్రామానికి చెందిన యువకులు తమ వాట్సప్ గ్రూప్లో పోస్ట్చేశారు. విద్యుత్ సంస్థలో సీనియర్ అకౌంటెంట్గా పని చేస్తున్న అదేగ్రామానికి చెందిన అంజయ్య స్పందించి సీఎండి ప్రభాకర్ రావు దృష్టికి తీసుకెళ్ళారు. దాంతో ఆయన పేద కుటంబానికి సొంత ఇట్లు కట్టించేందుకు అవసరమైన నగదును అందచేశారు. దాంతో స్థానిక పెద్దల సహకారంతో అంజయ్య రెండు గదుల ఇంటిని నిర్మించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు ట్రాన్స్కో, జెన్కో సీఎండి ప్రభాకర్రావు, సీనియర్ అకౌంటెంట్ అంజయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు.