Saturday, April 27, 2024

ఆదివాసీ మహిళ మృతిపై గవర్నర్ సీరియస్

- Advertisement -
- Advertisement -

Tamilisai Soundararajan

మనతెలంగాణ/హైదరాబాద్: రిమ్స్‌లో ఆదివాసీ మహిళ మృతిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ మృతిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆమె అధికారులను ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో మహిళ మృతిపై జిల్లా వైద్యాధికారి విచారణ జరుపుతున్నారు. ఈనెల 19న రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివాసీ జయశీల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు కడుపులో ఉన్న కవలలు కూడా మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయారని ఆదివాసీ సంఘాలు ఆరోపించాయి. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Governor Tamilisai serious over dalit woman dead

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News