- Advertisement -
అమరావతి: ఎపిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 19,085 శాంపిళ్లను పరీక్షించగా మరో 553 కొత్త కోవిడ్-19 కేసులు 7మరణాలు నమోదయ్యాయని ఎపి వైద్యశాఖ పేర్కొంది. విదేశాల నుంచి ఎపికి వచ్చిన ఏడుగురికి కరోనా సోకింది. ఇతర రాష్ట్రాల నుంచి ఎపికి వచ్చిన 69మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఎపిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,884కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 136కి పెరిగింది. ఎపివ్యాప్తంగా 5,760 యాక్టివ్ కేసులుండగా.. 4,988 మంది కరోనాతో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇండియాలో కోవిడ్ కేసులు ఐదు లక్షలకు చేరువయ్యాయి.
553 New Corona Positive Cases in Andhra Pradesh
- Advertisement -