చర్లపల్లి: ఇంటి కిరాయి అడిగిన ఇంటి ఒనర్పై కత్తితో దాడి చేసిన సంఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ పరిధిలోని విఎన్రెడ్డినగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా చంక్రకళ తన భర్త కార్తీక్తో కలసి సాయిల్గౌడ్ నివాసంలో కిరాయికి ఉంటున్నారు. గత నాలుగు నెలలుగా కార్తీక్ ఇంటి కిరాయి చెల్లించకపోవడంతో ఇంటి ఒనర్ కిరాయిదారులను కిరాయి చెల్లించాలని కోరారు.
ఇప్పడు ఆర్ధిక పరిస్థ్ధితులు ఇబ్బందిగా ఉందని తరువాత చెల్లిస్తానని తెలిపారు. సాయంత్రం ఇంటి ఒనర్ కొడుకు వచ్చి కిరాయి చెల్లించేందుకు ఇబ్బంది ఎమిటని ప్రశ్నించగా చంద్రకళ భర్త కార్తిక్ ఇంట్లో ఉన్న కొడవలితో ఇంటి ఓనర్ కొడుకుపై దాడి చేశాడు. దీంతో చేతికి తీవ్ర గాయం కావడంలో స్థ్ధానిక కుషాయిగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మన్మోహన్ తెలిపారు.