Tuesday, April 30, 2024

మాస్క్ ధరించడం వీరుడి లక్షణం

- Advertisement -
- Advertisement -

Wear mask compulsory said by Chiranjeevi

“మీసం మెలేయడం వీరత్వం అనేది ఒకప్పుడు.. కానీ ఇపుడు మాస్క్ ధరించడం వీరుడి లక్షణం”… ఈ మాట అన్నది ఎవరో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి. కరోనా మహమ్మారీ ప్రపంచవ్యాప్తంగా దండయాత్రకు దిగినప్పుడు టాలీవుడ్‌ని అప్రమత్తం చేయడంలో, జనాన్ని జాగృతం చేయడంలో మెగాస్టార్ కృషి తెలిసిందే. ఉపాధి కరువై సినీకార్మికులు రోడ్డున పడకుండా కాపాడేందుకు కరోనా క్రైసిస్ చారిటీ (సిసిసి)ని ప్రారంభించారు. వేలాది కార్మికులకు నెలకోమారు నిత్యావసర సరుకులను పంచే ఏర్పాటు చేశారు. కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించండి& మిమ్మల్ని మీరు కాపాడుకోండి… అంటూ అప్పట్లో వీడియో సందేశం ఇచ్చారు చిరు. అమితాబ్ బచ్చన్ సహా అన్ని పరిశ్రమల దిగ్గజ స్టార్లతో కలిసి తాను ఒక లఘు చిత్రంలో నటించి ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇప్పుడు కూడా మరోసారి ప్రచారం కోసం వీడియోలను రూపొందించారు. మాస్క్ ధరించి మీ కుటుంబాన్ని, దేశాన్ని కూడా కాపాడండి… ప్లీజ్ అంటూ అభ్యర్థించారు చిరు. మహమ్మారీ మనుముందు పెనువిలయం సృష్టించనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) హెచ్చరించిన నేపథ్యంలో చిరు మరో వీడియోతో ప్రేక్షకాభిమానులను హెచ్చరించే ప్రయత్నం చేశారు. దయచేసి ప్రాథమిక జాగ్రత్తలను పాటిస్తూ… ఐక్యంగా పోరాడి ఈ బాధలను తొలగించు కుందాం అంటూ చిరు విజ్ఞప్తి చేశారు. హీరోయిన్ ఈషా రెబ్బా, యువ హీరో కార్తికేయ కనిపించిన ఈ రెండు వీడియోలు సోషల్‌మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇక మెగాస్టార్ ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉండగా కరోనా తీవ్రత దృష్టా వేచి చూస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News