- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,286 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. గడిచిన 24గంటల్లో హైదరాబాద్ లో 391, రంగారెడ్డిలో 121, కరీంనగర్ లో 101, మేడ్చల్ లో 72 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 68,946కి చేరుకున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 563 మంది బాధితులు కరోనాతో మృతి చెందారు. తెలంగాణవ్యాప్తంగా 18,708 యాక్టివ్ కేసులుండగా.. 49,675 మంది కోవిడ్-19 నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు తెలంగాణలో కరోనా టెస్టులు ఐదు లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 13,787 మందికి టెస్టులు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలో 5లక్షల 1,025 మందికి పరీక్షలు నిర్వహించారు.
1286 new corona cases reported in Telangana
- Advertisement -