Saturday, May 4, 2024

భీవండి ఘటనలో 17కు చేరిన మృతులు

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండిలో భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 17కు చేరింది. వివిధ ఆస్పత్రులో మరో 20 మంది చికిత్స పొందుతున్నారు. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో భవనం కూలిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. కూలిపోయిన భవనంలో 40 ప్లాట్లలో 150 మంది జీవనం సాగిస్తున్నారు. భవన యజమాని సయ్యద్ అహ్మద్ జిలానీపై కేసులు నమోదు చేశామని భీవాండి డిఎస్‌పి రాజ్‌కుమార్ షిండే తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News