అమరావతి: విజయవాడలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులను చూస్తుండగా కృష్ణా నది బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మన్నే దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి బ్రిడ్జిపై పూజా చేస్తుండగా తన తమ్ముడి కుమారుడు సుజిత్ వీడియో తీయమని చెప్పి బ్రిడ్జిపై నుంచి నీళ్లలో దూకాడు. చూస్తుండగానే నీళ్లలో ఆ వ్యక్తి గల్లంతయ్యాడు. సుజిత్ ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. స్థానికుల పోలీసులకు సుజిత్ సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనారోగ్య సమస్యలతోనే దుర్గా ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడని సూసైడ్ లేటర్ లో రాసి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గల్లంతైన దుర్గా ప్రసాద్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు. దుర్గా ప్రసాద్ ఆర్టీసిలో పని చేసి రిటైర్ మెంట్ తీసుకున్నాడని, ఎన్ఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షుడి పని చేస్తున్నారని సమాచారం.