Tuesday, April 30, 2024

తల్లిని హత్య చేసిన నిందితుడికి జీవితఖైదు

- Advertisement -
- Advertisement -

Man gets life sentence for killing mother at Ranga Reddy

రంగారెడ్డి: మద్యానికి బానిసగా మారిన కుమారుడు డబ్బులు ఇవ్వలేదని తల్లిని హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్ మండలం, గుర్రంగూడ, ఆదిత్యనగర్‌కు చెందిన యాదమ్మ 2016,13, జూలైలో అనుమానస్పదస్థితిలో మృతి చెందింది. బాధితురాలి కూతురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కుమారుడు కొండయ్య హత్య చేసినట్లు తెలుసుకుని అరెస్టు చేశారు. ఎపిలోని ప్రకాశం జిల్లాకు చెందిన నిందితుడు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు.

చిన్నప్పటి నుంచి పనిచేయకుండా తిరుగుతున్న కొండయ్య మద్యానికి బానిసగా మారాడు. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. తరచూ తల్లిని డబ్బుల కోసం వేధించేవాడు. వారసత్వంగా వచ్చిన ఆస్థిని విక్రయించగా లక్ష రూపాయలు వచ్చాయి. వాటిని యాదమ్మ, సత్యనారాయణ అనే వ్యక్తికి వడ్డీకి ఇచ్చింది. నెల నెల వస్తున్న వడ్డీ రూ. ౩,౦౦౦ ఇవ్వాలని కొండయ్య తల్లిని వేధిస్తున్నాడు. డబ్బులు ఇవ్వడంలేదని తల్లిని హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో సాక్షాలు ప్రవేశపెట్టడంతో కోర్టు నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News