అబుదాబి: ఐపిఎల్ 13లో భాగంగా లీగ్ దశలో మరో ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. అబుదాబి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఢీకొనబోతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ కీరన్ పొలార్డ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్నఇరుజట్ల మధ్య జరుగుతుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కాగా, ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. దీంతో ఇరుజట్లు ఈ మ్యాచ్ లో సత్తా చాటలని పట్టుదలగా ఉన్నాయి. కాగా, తొడకండరాల గాయంతో గత రెండు మ్యాచ్ లకు బెంచ్ కే పరిమితమయ్యిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు.
#MumbaiIndians Captain Kieron Pollard wins the toss and elects to bowl first against #RCB #Dream11IPL pic.twitter.com/m6voxFiOOt
— IndianPremierLeague (@IPL) October 28, 2020
IPL 2020: MI Win Toss and Opt Bowl against RCB