- Advertisement -
మన తెలంగాణ/ సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ కు చెందిన నాలుగు బస్సులు బుధవారం ప్రమాదవశాత్తు అంటుకుని దగ్ధమయ్యాయి. లాక్డౌన్ కారణంగా కొద్ది నెలలుగా పాఠశాలలు మూసివేయడంతో ప్రైవేటు స్థలంలో నిలిచిన ఉంచిన బస్సులు దగ్ధమవ్వగా… సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అర్పేశారు. మంటలు అంటుకోవడానికి గల కారణాలను గుర్తించి దర్యాప్తు చేస్తున్నామని సిద్దిపేట వన్టౌన్ సిఐ సైదులు తెలిపారు.
- Advertisement -