భక్తజనంతో కలిసి ప్రసాదం తిన్న మంత్రి ఎర్రబెల్లి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి అంటే సాధారణంగా వివిఐపి ట్రీట్మెంట్ ఉంటుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అందుకు భిన్నం. సామాన్యులతోనే నేను అని నిరూపించుకున్నారు. బుధవారం భద్రకాళి టెంపుల్ను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సామాన్య భక్తులతో కలిసి ప్రసాదం తీసుకుని, వారితో పాటే కూర్చోని తిన్నారు మాస్ లీడర్గా పేరున్న ఎర్రబెల్లి. మంత్రి దయాకర్రావు వ్యవహారించిన తీరు పట్ల దేవాలయానికి వచ్చిన భక్తులు హర్షం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద దేవాలయాల వద్ద సామాన్యులు దైవ దర్శనం కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తుంటారని, విఐపిలు, వివిఐపిలు వచ్చిన క్షణాల్లోనే దర్శనం చేసుకుని వెళ్తారని, వారంతా ఇలా మంత్రి మాదిరిగా వ్యవహరిస్తే సామాన్య భక్తులకు కొంత వరకైనా ఇబ్బందులు తగ్గుతాయని కొందరు భక్తులు చర్చించుకోవటం కన్పించింది.