- Advertisement -
ఖాట్మాండూ: నేపాల్ లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైటాడి జిల్లాలోని ఖోడ్పే ప్రాంతంలో దశరథ్ చంద్ జాతీయ రహదారిపై బస్సు (ఎన్ఎ 5 కెహెచ్ఎ 5141) అదుపు తప్పి బోల్తా పడడంతో తొమ్మిది మంది మృతి చెందగా 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు డిఎస్ పి నారాయణ్ ప్రసాద్ అధికారి అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులలో ఇద్దరు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారన్నారు. క్షతగాత్రులను దాదేల్ దుహ్రా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. దారుచుల్ల జిల్లాలోని ఘనా ప్రాంతం నుంచి మహేందర్ నగర్ కు బస్సు వెళ్తుండగా పటాన్ మున్సిపాలిటి-8 ప్రాంతంలో రోడ్డు నుంచి 600 మీటర్ల దూరం దూసుకెళ్లిన అనంతరం బోల్తా పడిందని డిఎస్ పి తెలిపాడు.
- Advertisement -