- Advertisement -
న్యూఢిల్లీ: నివర్ తుపాను తాకిడికి అతలాకుతలమైన తమిళనాడు ఇంకా కోలుకోక ముందే మళ్లీ భారీ వర్షాలను ఎదుర్కోనున్నది. డిసెంబర్ 2న శ్రీలంక తీరాన్ని దాటనున్న తుపాను ప్రభావంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. గత వారమే తీవ్ర తుపానుగాఏర్పడిన నివర్ తమిళనాడును వణికించింది. ప్రాణనష్టేమదీ సంభవించనప్పటికీ దాదాపు రెండున్నర లక్షల మందిని ముందు జాగ్రత్తగా తమిళనాడులోని వేర్వేరు ప్రాంతాలలో షెల్టర్లలో ఆశ్రయం కల్పించారు. తమిళనాడు, కేరళలోని దక్షిణ ప్రాంతాలలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ ఎరుపు రంగు హెచ్చరికను జారీచేసింది. ఈ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
- Advertisement -