- Advertisement -
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. 195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 4 వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలుండగానే గెలుపొందింది. చివరి ఓవర్లలో 14 పరుగులు అవసరం కాగా.. హర్దిక్ పాండ్యా(42 నాటౌట్) రెండు భారీ సిక్స్ లతో భారత్ విజయాన్ని అందించాడు. ఓపెనర్లు కెఎల్ రాహుల్(30), శిఖర్ ధావన్(52), కెప్టెన్ విరాట్ కోహ్లీ(40), సంజూ శాంసన్(15), శ్రేయస్ అయ్యార్(12)లు రాణించారు. దీంతో భారత్, ఆసీస్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది.
T20 Squad: IND Win by 6 Wickets against AUS
- Advertisement -