=హైరాబాద్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 8న భారత్ బంద్ ను విజయవంతం చేయాలని మంత్రి కెటిఆర్ అన్నారు. షాపులు బంద్ చేసి రైతులకు వ్యాపారులు సంఘీభావం ప్రకటించాలని కొరారు. ఈ నెల 8న రాష్ట్రంలోని ప్రతి వ్యాపారవేత్త, వాణిజ్య సముదాయాలు 2గంటలు బంద్ లో పాల్గొనాలని, రవాణారంగానికి చెందినవారు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం 12గంటల వరకు జాతీయ రమదారులను దిగ్బంధిస్తామని తెలిపారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల పోరాట పటిమకు సెల్యూట్ అన్న మంత్రి కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో ఓటు వేశామన్నారు. భారత్ బంద్ లో పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా గల్లీగల్లీ బంద్ పాటించాలని సూచించారు. మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఎలు జాతీయరహదారులపై బైఠాయిస్తారని చెప్పారు. రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Bharat Bandh must succeed Says Minister KTR