Saturday, May 11, 2024

పెళ్లి పేరుతో పరువు హత్య

- Advertisement -
- Advertisement -

Boy Friend women killing by her relatives

 

ఛండీగఢ్: ప్రియుడు, ప్రియురాలిని హత్య చేసిన సంఘటన హర్యానాలోని రోహటక్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పూజా అనే వివాహిత కన్హేలి గ్రామంలో నివసిస్తోంది. బక్హేటా గ్రామంలో రోహిత్ అనే యువకుడు నివసిస్తున్నాడు. ఇద్దరు జాట్ కులానికి చెందినవారు కావడంతో గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పూజా తన బాబాయి కుల్దీప్ ఇంట్లో నివసిస్తోంది. వీళ్ల వ్యవహారం కుల్దీప్‌కు నచ్చకపోవడంతో చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరికి పెళ్లి చేస్తానని కోర్టు వద్దకు రమ్మని కబురుపంపాడు. మహరిషి దయానంద్ యూనివర్సిటీలోని మొదటి గేట్ వద్దకు రాగానే  రోహిత్‌ను కుల్దీప్ తన గన్‌తో కాల్చాడు. మరో కారులో ఉన్న పూజాను బాబాయి కుమారుడు కాల్చాడు. ఈ ఘటనపై ఎస్‌పి రాహుల్ శర్మ కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News