Friday, May 10, 2024

వేర్వేరు ప్రమాదాలు: 12 మంది మృతి

- Advertisement -
- Advertisement -

12 members dead in Road Accident

 

భువనేశ్వర్: మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో 12 మంది మృతి చెందగా 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశాలోని కోట్ పూట్ జిల్లాలో అతి వేగంగా వెళ్తున్న వ్యాన్ మూల మలుపు వద్ద బోల్తాపడడంతో 9 మంది దుర్మరణం చెందారు. గాయపడిన 13 మందిని ఆస్పత్రికి తరలించామని డిఎం మధుసూదన్ తెలిపారు. సింధిగూడ ప్రాంతం నుంచి కుల్టా ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మహారాష్ట్రాలోని సాతారా జిల్లా కరాడ్ ప్రాంతంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారు. రెజర్లు పుణే నుంచి కోల్హాపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.  గాయపడిని 8 మంది రెజ్లర్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News