Tuesday, May 14, 2024

జియో ఫోన్ వినియోగదారులకు శుభవార్త….

- Advertisement -
- Advertisement -

Good news for Jio customers

ముంబయి: జియో ఫోన్ వినియోగదారులకు రిలయన్స్ జియో సంస్థ శుభవార్త అందించింది. కరోనా సమయంలో ఉచిత ఔట్ గోయింగ్ కాల్స్ అందిస్తామని ప్రకటించింది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టేవరుకు రోజుకు 300 నిమిషాల ఉచిత ఔట్ గోయింగ్ కాల్స్ అందిస్తామని జియో సంస్థ ప్రకటించింది. లాక్ డౌన్ తో పాటు కరోనా నేపథ్యంలో రీఛార్జ్ చేయించుకోలేకపోయిన జియో యూజర్స్ ఈ పథకం అందుబాటులోకి రానుంది. సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తున్న వేళ కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ లేదా పాక్షిక లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో యూజర్స్ కు ఫ్రీ టాక్ టైమ్ అందించిన తొలి సంస్థ రిలయన్స్ జియో.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News