- Advertisement -
హైదరాబాద్: తొలి ప్రేమ చిత్రంతో కీర్తి రెడ్డి టాలీవుడ్ లో అడుగు పెట్టింది. 2004లో హీరో సుమంత్ ను పెళ్లి చేసుకొని 2006లో విడాకులు తీసుకుంది. బిజినెస్ మెన్ ను వివాహం చేసుకొని బెంగళూరులో ఉంటుంది. కీర్తి రెడ్డి తండ్రి కేశ్ పల్లి ఆనంద్ రెడ్డి(60) శుక్రవారం ఉదయం గుండెపోటుతో చనిపోయాడు. మరణవార్త తెలియగానే కీర్తి రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆనంద్ రెడ్డికి భార్య, ఇద్దరు కమార్తెలు ఉన్నారు. 2018 నుంచి టిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా ఆనంద్ రెడ్డి పని చేస్తున్నారు.
- Advertisement -