కడప: ఆంధప్రదేశ్లోని రాయల సీమలో ఫ్యాక్షన్ మరోమారు పడగ విప్పింది. మొన్న కడప జిల్లా, నిన్న కర్నూలు జిల్లా, నేడు అనంతపురం జిల్లాలో ఒక్కసారి పాత కక్షలు చెలరేగాయి. మూడు జిల్లాలో ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. మరుగున పడిందనుకున్న ఫ్యాక్షన్ రక్కసికి ఈ హత్యలు ప్రాణం పోశాయి. అనంతలో మరోసారి వర్గ కక్షలు భగ్గుమన్నాయి. ఫ్యాక్షన్ రక్కసికి ఇద్దరు బలయ్యారు. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం అచ్యుతాపురంలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలను ప్రత్యర్థులు దారుణ హత్య చేశారు.
భూ వివాదంపై తాహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా అచ్యుతాపురం, వేటాపురం గ్రా మాల మధ్య రాజగోపాల్, నారాయణప్పలను దారుణంగా హత్య చేశారు. ప్రత్యర్థుల దాడిలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. దేవాలయ భూముల ఆక్రమణ విషయంలో గ్రామానికి చెందిన ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. హత్యకు గురైన ఇద్దరు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులని గ్రామస్తులు చెబుతున్నారు. విషయం తెలిసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.