- Advertisement -
లక్నో: నవవధువుపై భర్త, ఇద్దరు మరుదులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని బుదాన్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కోత్వాలి ప్రాంతానికి చెందిన యువతి, ఉస్మాన్పూర్లో ఉంటున్న యువకుడికి ఈ నెల 22న పెళ్లి జరిగింది. వివాహనం జరిగిన తరువాత మెట్టినింట్లో కాలు పెట్టింది. నవ వధువు అత్తింటి వారు కట్నం పేరుతో వేధించడంతో పాటు ఆమెపై భర్త, మరుదులు సామూహిక అత్యాచారం చేశారు. కూతురు జరుగుతున్న అన్యాయాలపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఏడుగురును రిమాండ్కు తరలించారు.
- Advertisement -