Tuesday, April 30, 2024

మంత్రి కెటిఆర్‌తో సమావేశమైన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు బుధవారం మంత్రి కె తారకరామారావును ప్రగతి భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. దశాబ్దాల పాటు లక్షలాది మందికి అద్భుతమైన వైద్య సేవలు అందించిన దత్తాత్రేయను కలవడం పట్ల మంత్రి కెటిఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరువురు వైద్య రంగంలో, ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సా విధానాల్లో వివిధ దేశాలు అనుసరిస్తున్న ఆదర్శనీయమైన పద్దతులపైన చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలపైన మంత్రి కెటిఆర్ సమాచారం అందించారు.

ఈ కరోనా సంక్షోభం తర్వాత అన్ని ప్రభుత్వాలు ఆరోగ్య రంగంలో భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసేందుకు సుముఖంగా ఉన్నాయని వెల్లడించారు. ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయాలన్న పట్టుదలతో సిఎం కెసిఆర్ ఉన్నారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించిన నోరి దత్తాత్రేయుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల వైద్య కార్యక్రమాలకు ముఖ్యంగా క్యాన్సర్ సంబంధిత కార్యక్రమాలకు తన మద్దతు ఉంటుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన మంత్రి కెటిఆర్‌కు వివరించారు. తన వైద్య విద్య, వృత్తి హైదరాబాదులోనే ప్రారంభమైందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటానని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News