- Advertisement -
న్యూఢిల్లీ: టీమిండియాలోనే కెఎల్.రాహుల్ అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో పోల్చితే రాహుల్ మెరుగైన ఆటగాడన్నాడు. ఫార్మాట్ ఏదైనా నిలకడగా ఆడే సత్తా అతనికుందన్నాడు. మూడు ఫార్మాట్లలో కూడా టీమిండియాకు రాహుల్ సేవలు ఎంతో అవసరమన్నాడు. ఐపిఎల్లో అత్యంత నిలకడగా రాణించిన బ్యాట్స్మన్లలో రాహుల్ ఒకడనే విషయాన్ని గంభీర్ గుర్తు చేశాడు. విరాట్, రోహిత్ తదితరులు ఐపిఎల్లో మెరుగ్గా రాణించలేక పోయారని, అయితే రాహుల్ మాత్రం బాగా బ్యాటింగ్ చేశాడని ప్రశంసించాడు. రానున్న రోజుల్లో రాహుల్ టీమిండియాకు ప్రధాన అస్త్రంగా మారడం ఖాయమని గంభీర్ జోస్యం చెప్పాడు.
- Advertisement -