Saturday, May 4, 2024

టిఆర్‌ఎస్ ప్లీనరీకి ఘనంగా ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

Minister Sabitha reviews arrangements for TRS Plenary

హాజరుకానున్న సిఎం కెసిఆర్, మంత్రులు, పార్టీ నాయకులు
ఏర్పాట్లను పరిశీలించిన టిఆర్‌ఎస్ నాయకులు

హైదరాబాద్: టిఆర్‌ఎస్ ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లను టిఆర్‌ఎస్ నాయకులు మంగళవారం పరిశీలించారు. ప్లీనరీ ఆహ్వాన కమిటీ సభ్యులుగా ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీలు ఏర్పాట్ల గురించి సమీక్ష జరిపారు. ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని వారు సంబంధిత నాయకులను ఆదేశించారు. ప్లీనరీకి వచ్చే ప్రజా ప్రతినిధులు, నాయకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని నాయకులకు వారు సూచించారు. నిర్ణీత కాలానికి ముందే ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని సంబంధిత ఇంచార్జీలను వారు ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్ కుమార్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రోజా రంగారావు, ట్రాఫిక్ డిసిపి విజయ్ కుమార్, జిహెచ్‌ఎంసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News