Monday, April 29, 2024

రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం: ప్రియాంక గాంధీ

- Advertisement -
- Advertisement -

Priyanka Gandhi
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం రూ. 10 లక్షల వరకు ప్రజలకు ఉచిత వైద్యం వాగ్దానం చేశారు. ఒకవేళ ప్రజలు తమ  పార్టీని గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు చేసేలా తోడ్పడితే ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తానని ఆమె అన్నారు.  శనివారం ఏడు వాగ్దానాలతో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బారాబంకీ జిల్లాలో ఆమె తమ పార్టీ ‘ప్రతిజ్ఞ యాత్రలు’కు జెండా ఊపి ఆరంభించారన్నది తెలిసిన విషయమే. తమ పార్టీని గెలిపించి ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడితే రైతు రుణాలు మాఫీ చేస్తామని, 20 లక్షల మేరకు ఉద్యోగాలు కల్పిస్తామని కూడా ఆమె తమ పార్టీ వాగ్దానాల్లో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News