- Advertisement -
హైదరాబాద్ : వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజెపికి ఘోర పరాజయం తప్పదని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఉత్తరప్రదేశ్లో మాత్రమే కాదని, శనివారం పోలింగ్ జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ బిజెపి ఓటమి ఖాయమని చెప్పారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 100 స్థానాల్లో పోటీ చేస్తుందని అసద్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే తమ లక్షమని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలకు బిజెపి విభజన రాజకీయాలపై మంచి అవగాహన ఉన్నదని, ఈ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటర్లు గుణపాఠం చెబుతారని అన్నారు. కేంద్ర సర్కార్ తెలంగాణ విషయంలో పక్షపాత వైఖరి అవలంబిస్తున్నదని, ముఖ్యంగా ఆర్థిక సహకారం అందించడంలో వివక్ష చూపుతోందని అసద్ మండిపడ్డారు.
- Advertisement -