- Advertisement -
ఆ రోజు అధికారులందరూ ఆర్టీసి బస్సులో ప్రయాణించాలి
ఉత్తర్వులను జారీ చేసిన టిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్
హైదరాబాద్: టిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రతి గురువారం ఆర్టీసి ఉద్యోగులు పండుగ చేసుకునేలా ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు, ఆర్టీసి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి ప్రతి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల్లో బస్సు దినోత్సవాలను నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. గురువారం అధికారులందరూ ఆర్టీసి బస్సులో ప్రయాణం చేయాలని ఎండి సూచించారు. దీని వలన ప్రయాణికుల సమస్యలను నేరుగా తెలుసుకోవచ్చని ఆర్టీసి ఉద్యోగులకు సజ్జనార్ సూచించారు. సజ్జనార్ నిర్ణయంతో ఆర్టీసి యాజమాన్యం సంతోషంలో మునిగిపోయింది.
- Advertisement -