Monday, April 29, 2024

ఎఎన్‌ఎం వరలక్ష్మి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం

- Advertisement -
- Advertisement -

Harish rao will support to vara laxmi family

రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్:  రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎఎన్‌ఎం వరలక్ష్మి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్‌ఎం గా విధులు నిర్వహిస్తూ పుల్లూరు గ్రామంలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి తన స్కూటీపై వెళ్లి లారీ ఢీ కొన్న ఘటనలో ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే. సమాచారం తెలుసుకున్న మంత్రి హరీష్‌రావు ఆమె మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరలక్ష్మిమృతదేహానికి ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. 50 లక్షల రూపాయల బీమా సొమ్ము వరలక్ష్మి కుటుంబానికి ఇవ్వడంతో పాటు, ఒకరికీ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. వరలక్ష్మి అవివాహిత కాగా ఆమెకు ముగ్గురు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News