- Advertisement -
ఆదిలాబాద్: రెండు బైక్లు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం కమ్మరి తండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు ఘటనా స్థలంలో చనిపోయారు. మృతులలో ఇద్దరు తడిహత్నూరు గ్రామం, మరొకరిది పెరికగూడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
- Advertisement -