Sunday, May 12, 2024

అభివృద్ధికి అన్వేషణ

- Advertisement -
- Advertisement -

మూసీ రివర్‌ఫ్రంట్ కోసం దుబాయ్‌లో ప్రపంచస్థాయి సిటీ ప్లానర్లు, డెవలపర్లతో సిఎం రేవంత్ భేటీ

మన తెలంగాణ/హైదరాబాద్ : చారిత్రాత్మక నగరాలన్నీ నీటి వనరుల చుట్టే అభివృద్ధి చెందాయి. నదులు, సరస్సులు వాటికి సహజత్వాన్ని తెచ్చిపెట్టాయి. మూ సీ పునరుద్ధరణతో హైదరాబాద్ సిటీ ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా మారుతుందని సిఎం రేవంత్ అన్నారు.మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై దృష్టి సారించిన సిఎం రేవంత్ రెడ్డి దాని అభివృద్ధికి సంబంధించి తమకు సహకారం అందించాలని లండన్‌లోని ప్రముఖ సంస్థలతో చర్చలు జరిపిన ఆ యన ఆదివారం దుబాయ్‌లో ప్రపంచ స్థా యి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లతో సైతం భేటీ అయ్యారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించే డి జైన్లు, నమూనాలకు సంబంధించి దుబాయ్‌లోని సుమారు 70 సంస్థలతో సిఎం రేవంత్ సంప్రదింపులు జరిపారు. లండన్ నుంచి నేరుగా దుబాయ్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి ఆదివారం దుబాయ్‌లో బిజీ బిజీగా గడిపారు. హైదరాబాద్ సిటీలో మూసీ రివ ర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపైనే ఈ కీలక స మావేశాల్లో ఆయన పాల్గొన్నారు. 56 కిలోమీటర్ల పొడవునా మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్భన్ పార్క్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు, అభివృద్ధి న మూనాలు, వాటికి అవసరమైన పెట్టుబడులపై వివిధ సంస్థలతో ముఖ్యమంత్రి చర్చ లు జరిపారు. ప్రపంచంలో పేరొందిన కం పెనీలు, డిజైన్, ప్లానింగ్, ఆర్కిటెక్చర్ సం స్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతో స మావేశమయ్యారు. దాదాపు అన్ని సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి, హైదరాబాద్‌లో మూసీ రివర్ డెవెలప్‌మెం ట్ ప్రాజెక్టుపై ఆసక్తిని ప్రదర్శించాయి. తదుపరి సంప్రదింపులకు త్వరలోనే రాష్ట్రానికి వచ్చేందుకుఅంగీకరించాయి. ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం ఆదివారం అర్ధరాత్రి వరకు ఈ సంప్రదింపులు కొనసాగించింది.

డిజైన్లు, నమూనాలు రూపొందించాలి
ఈ సందర్భంగా సిఎం రేవంత్ వారితో మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ రివర్ ప్రాజెక్టుకు అపురూపమైన డిజైన్లు, నమూనాలు రూపొందించాలని వారిని కోరారు. ఇతర సిటీలు, రాష్ట్రాలతో తాము పోటీ పడటం లేదని, ప్రపంచంలోనే అత్యుత్తమమైన బెంచ్‌మార్క్ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సిఎంతో పాటు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్భన్ డెవెలప్‌మెంట్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, సిఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, హెచ్‌ఎండి జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండి అమ్రాపాలితో పాటు అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
వాటర్ ఫ్రంట్ అందాలను తిలకించిన సిఎం
దుబాయ్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి దుబాయ్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టును సందర్శించారు. ఆదివారం మధ్యాహ్నం ఒక స్కై స్కాపర్ (ఆకాశ హర్మ్యం) పైకి వెళ్లి ఏరియల్ వ్యూ లా కనిపించే వాటర్ ఫ్రంట్ అందాలను ఆయన తిలకించారు. చుట్టూ నీళ్లు పక్కనే ఆకాశాన్ని అంటుతున్నట్లు కనిపించే అందమైన భవంతులు, నీళ్ల చుట్టూ అందమైన రహదారులతో ఒకదానికొకటి అనుబంధంగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు దుబాయ్‌లో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ ప్రాజెక్టు నిర్వహణ వ్యవహరాలు, దాంతో ముడిపడి ఉన్న సామాజిక ఆర్థిక ప్రభావాలను సిఎం అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత సమయం పట్టింది.. ఎంత ఖర్చయింది..? ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి..? నిర్వహణకు అనుసరిస్తున్న విధానాలపై వారితో సిఎం రేవంత్ చర్చించారు.హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ నిర్మించేందుకు దేశ విదేశాల్లోని వివిధ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రతినిధి బృందం అధ్యయనం చేస్తోంది. అందులో భాగంగానే సిఎం నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం లండన్‌లో థేమ్స్ రివర్ ఫ్రంట్‌ను, దుబాయ్‌లో వాటర్ ఫ్రంట్ ను సందర్శించింది. మరోవైపు ఈ నెల 15న దావోస్‌లో పర్యటించిన సిఎం బృందం అనంతరం లండన్‌లో పర్యటించింది. ఆదివారం దుబాయ్‌లో పర్యటన ముగిసిన తర్వాత హైదరాబాద్ బయల్దేరింది. నేడు ఉదయం ఎనిమిది గంటలకు సిఎం హైదరాబాద్‌కు చేరుకుంటారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News