Monday, April 29, 2024

ఎస్సారెస్పి జీరో పాయింట్‌కి పర్యాటకుల సందడి

- Advertisement -
- Advertisement -

ముప్కాల్ : కాళేశ్వరం నుండి నీరు విడుదల చేయడంతో ముప్కాల్ వదర కాలువ వద్ద ఉన్న జీరో పాయింట్ దగ్గరికి ప్రజలు తండోపదండలుగా కుటుంబ సమేతంగా వచ్చి నీటిని ఎత్తిపోస్తున్న తీరును చూస్తున్నారు. జిల్లాల నుండి నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లా నుండి జనాలు పెద్ద ఎత్తున వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు ఆనందోత్సవాలతో గడిపారు. అదేవిధంగా రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి రావడం వల్ల చుట్టుపక్కల గ్రామాల రైతులు ప్రాజెక్టును సందర్శించి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముప్కాల్ మండల పరిసర ప్రాంతాల్లో ఊర పండుగలు సందర్భంగా వరద కాలువ సమీపంలో వనభోజనాలు జరగడంతో జనం తాకిడి ఎక్కువైంది.
ఎస్సారెస్పీ జీరో పాయింట్ వద్ద కాలేశ్వరం నుండి 20049 క్యూసెక్కుల నీటిని నాలుగు మోటార్‌ల ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 1065 అడుగులు 21.233 టిఎంసిలుగా ఉందని తెలిపారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుండి 2049 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.
భద్రత మరిచిన అధికారులు : ముప్కాల్ కాలేశ్వరం పంప్ హౌస్ వద్ద నిత్యం సందర్శకులు తాకిడి పెరగడంతో భద్రత ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిర్లక్ష వైఖరి ప్రదర్శిస్తున్నారు. నీరు వెళ్తున్న కాల్వ పక్కన చిన్న కర్రలతో చిన్న కంచె ఏర్పాట్లు చేశారు. ప్రాజెక్టులో వచ్చి అదుపు తప్పితే అవకాశం ఉందని భద్రత చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. గోదావరి నీళ్లలో కాలేశ్వరం నీళ్లు కలిసే ప్రదేశంలో పర్యాటకులు సెల్పీలు తీయడం, స్నానాలు చేయడం వంటివి ప్రమాదకరమని వచ్చిన పర్యాటకులు భావిస్తున్నారు. ప్రాజెక్టు అధికారులు, పోలీసు భద్రత సిబ్బంది శ్రద్ద తీసుకొని పోలీసులను కాపలాగా ఉంచాలని పర్యాటకులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News