Wednesday, May 1, 2024

కింటుకూరు అటవీప్రాంతంలో ఓ జలధార వృక్షం

- Advertisement -
- Advertisement -

పాపికొండలు ప్రాంతంలో అరుదైన జలధార వృక్షం

అరుదైన నల్ల మద్ది చెట్టు

ఈ చెట్టు నుంచి 20 లీటర్ల వరకు నీరు వస్తుందని వెల్లడి

కింటుకూరు: గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని పాపికొండలు వద్ద అరుదైన వృక్షాన్ని గుర్తించారు. ఇక్కడి కింటుకూరు అటవీప్రాంతంలో ఓ జలధార వృక్షం అటవీశాఖ సిబ్బంది కంటపడింది. దీన్ని నల్ల మద్ది చెట్టు అంటారని, దీని నుంచి దాదాపు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని వారు వెల్లడించారు.  కింటుకూరు అటవీప్రాంతంలోని బేస్ క్యాంపును పరిశీలించేందుకు అటవీశాఖ అధికారులు వెళ్లగా, అక్కడ ఈ జలధార వృక్షం ఉండడాన్ని వారు గమనించారు. ఓ ఫారెస్ట్ గార్డ్ కత్తితో చెట్టుకు కొద్దిమేర రంధ్రం చేయగా, కుళాయి తిప్పినట్టు నీరు బయటికి వచ్చింది.  చెట్టు నుంచి నీరు బయటికి రావడం చూసి అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News