Saturday, April 27, 2024

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొన్న అమీర్ ఖాన్, నాగ చైతన్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో ఆదివారం బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, అక్కినేని నాగ చైతన్య పాల్గొన్నారు. లాల్ సింగ్ చద్ధా మూవీ షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన నేపథ్యంలో ఎంపి సంతోష్ కుమార్ తో కలిసి అమీర్ ఖాన్, నాగ చైతన్య బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మెక్కలు నాటారు. ఈసందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ”ఇప్పటి వరకు ఎన్నో ఛాలెంజ్ లను మనం చూసాం కానీ, మొక్కలు నాటాలనే అద్భుతమైన ఛాలెంజ్ ను మనకు అందించిన ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు. మనందరం అప్పనిసరిగా మొక్కలు నాటాలి, వాటిని బాధ్యతగా పెంచాలి. అప్పుడే మన భవిష్యత్ తరాలకు మనం జీవించడానికి అవకాశం ఇచ్చినవాళ్లం అవుతాం. దీన్ని ఒక కార్యక్రమంగా కాకుండా.. నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ప్రతీ ఒక్కరిని వేడుకుంటున్నాను” అని అన్నారు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని, మొక్కలు నాటిన అమీర్ ఖాన్, నాగ చైతన్యలకు ఈ సందర్భంగా ఎంపి ఎంపి సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

Aamir Khan and Naga Chaitanya plant Saplings at Begumpet Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News