Saturday, April 27, 2024

బిజెపి రహిత భారత్ టార్గెట్

- Advertisement -
- Advertisement -
Abhishek banerjee election campaign in Murshidabad
అభిషేక్ బెనర్జీ ప్రతిన

కోల్‌కతా : వచ్చే మూడేళ్లలో బిజెపిని భారత్‌ నుంచి పంపించివేయడమే తమ లక్ష్యం అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపి అభిషేక్ బెనర్జీ చెప్పారు. బెంగాల్ సిఎం మమత బెనర్జీ మేనల్లుడు అయిన అభిషేక్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలో జరిగే ఉప ఎన్నికల ప్రచార సభలలో గురువారం ప్రసంగించారు. ఈ సందర్భంగా బిజెపిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిజెపి లేని భారత్ తమ టార్గెట్ అన్నారు. తాము ప్రతి బిజెపి స్థానానికి ఎసరు పెడుతామని, బిజెపికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరిస్తామని, అప్పుడు వారి ఇడి, సిబిఐ ఇతర పంజరపు పక్షులు ఏమి చేస్తాయని ప్రశ్నించారు. ఏమి చేయలేవన్నారు. బిజెపి అధికారపు కోరలు తీసేస్తే చేసేందుకు ఏమీ ఉండదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News