అందజేసిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర
మనతెలంగాణ, సిటిబ్యూరో: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర చెక్కులు అందజేశారు. కమిషనరేట్లో గురువారం మృతిచెందిన ఇద్దరు కానిస్టేబుళ్ల కుటుంబాలకు చెక్కులను అందజేశారు. మైలార్దేవ్పల్లి, షాబాద్ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు తులసీరాం, శ్రీశైలం కుటుంబాలకు రూ.5లక్షలు, రూ.13లక్షల చెక్కులు అందజేశారు. అనారోగ్యంతో మృతిచెందిన ఆర్మ్డ్ రిజర్వు అసిస్టెంట్ సబ్ ఇన్స్స్పెక్టర్ ఎంఎ సయిద్ కుటుంబ సభ్యులకు రూ. 3,93,991 చెక్కు అందజేశారు.
మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ తులసీరాం ఓ కిడ్నాప్ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు మధ్యప్రదేశ్కు వెళ్లాడు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. సిఎఆర్లో ఎంటి సెక్షన్లో పనిచేస్తున్న ఎఎస్సై ఎంఎ సయిద్ కోవిడ్తో మృతిచెందాడు. కానిస్టేబుల్ తులసీరాం భార్య మౌనిక కు రూ.5లక్షలు, కానిస్టేబుల్ శ్రీశైలం తండ్రి చంద్రమౌలికి రూ.3లక్షలు, తల్లి నాగమణికి రూ.3లక్షలు, భార్య స్వప్నకు రూ.7లక్షలు, ఎఎస్సై ఎంఎ సయిద్ భార్య ఖదీర్బాను రూ.3,93,991 చెక్కు అందజేశారు. ఇంకా రావాల్సిన బెనిఫిట్స్ కూడా త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డిసిపి అనసూయ, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.