- Advertisement -
హైదరాబాద్ : టిఆర్ఎస్ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మంచి స్పందన వస్తోంది. అన్ని రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. దీనిలో భాగంగా మొక్కలు నాటిన సినీ హీరో రాజ్ తరుణ్. మొక్కలు నాటిన తర్వాత రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం అద్భుతమని కొనియాడారు హీరో రాజ్ తరుణ్. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకరిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. సినీ దర్శకుడు విజయ్ కుమార్ కొండ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరిస్తూ గచ్చిబౌలిలో మొక్కలు నాటిన హీరో రాజ్ తరుణ్. ఈ సందర్భంగా సినీ హీరోయిన్ హేమల్, ఆర్టిస్ట్ మధునందన్ లు కూడా గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.
- Advertisement -