Friday, May 10, 2024

శివానీకి ‘అద్భుతం’తో మంచి హిట్

- Advertisement -
- Advertisement -

Adbhutham movie 2021

తేజా సజ్జా, శివానీ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అద్భుతం’. చంద్రశేఖర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన సక్సెస్‌మీట్‌లో రాజశేఖర్, జీవిత, ప్రవీణ్ సత్తారు, శివానీ, శివాత్మిక, దర్శకుడు మల్లిక్ రామ్, నిర్మాత చంద్రశేఖర్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ “శివానీకి ‘అద్భుతం’తో మంచి హిట్ వచ్చింది. ఈ చిత్రంలో శివానీ తన నటనతో తండ్రిగా నన్ను గర్వపడేలా చేసింది”అని అన్నారు. శివానీ మాట్లాడుతూ “నిజానికి ఇది నా మూడో చిత్రం. ప్రశాంత్ వర్మ రాసిన కథతో ఇది రూపొందింది. ఈ సినిమాలో ప్రతి 15 నిమిషాలకు ఓ ట్విస్ట్ ఉంటుంది. కథ ఊహించని విధంగా మలుపు తీసుకుంటుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News