Sunday, May 12, 2024

ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ పై విచారణ వాయిదా…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఫైబర్‌నెట్ కేసులో టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. సుప్రీం కోర్టు నవంబర్ 9కి వాయిదా వేసింది. తొలుత నవంబర్ 8కి వాయిదా వేసినప్పటికి 9న విచారించాలని బాబు తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. స్కిల్ స్కామ్ కేసు తరువాత ఫైబర్ నెట్ కేసు పరిగణలోకి కోర్టు తీసుకుంది.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎసిబి కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు లీగల్ ములాఖత్ పిటిషన్ ఎసిబి కోర్టు కొట్టేసింది. లీగల్ ములాఖత్‌ల సంఖ్య మూడుకు పెంచాలని కోర్టును చంద్రబాబు తరుఫు న్యాయవాదులు గురువారం పిటిషన్లు వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News