- Advertisement -
ఢిల్లీ: రష్యా వెళ్తున్న ఎయిరిండియా విమానంలోని పైలెట్కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో విమానాన్ని అధికారులు వెనక్కి మళ్లించి ఇండియాకు రప్పించారు. వందే భారత్ మిషన్లో భాగంగా ఇవాళ విమానం మాస్కో బయలు దేరింది. రష్యాలో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు వెళ్లిన విమానంలో ఉన్న పైలెట్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ విమానం రాత్రి ఢిల్లీకి చేరుకుంటుందని, విమానంలో సిబ్బందిని క్వారంటైన్ చేస్తామని అధికారులు తెలిపారు. అంతేకాకుండా విమానాన్ని శానిటైజ్ చేస్తామని వెల్లడించారు.
- Advertisement -