Sunday, April 28, 2024

6 నగరాల నుంచి మలేసియాకు వీసా ఫ్రీ ట్రావెల్

- Advertisement -
- Advertisement -

ప్రకటించిన ఎయిర్ ఏషియా

న్యూఢిల్లీ : ఇటీవల భారతదేశం నుంచి వచ్చే పర్యాటకులకు మలేసియా వీసా ఫ్రీ ట్రావెల్‌ను ప్రకటించింది. ఈ సందర్భంగా ఎయిర్ ఏషియా దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కౌలాలంపూర్‌కు పరిమిత కాలంతో ప్రత్యేక ప్రమోషనల చార్జీలతో విమాన సర్వీసుల్ని ప్రకటించింది. తిరువనంతపురం (21 ఫిబ్రవరి 2024 నుండి ప్రారంభం) నుంచి సేవలను ప్రకటించింది. దక్షిణ భారతదేశంలోని ఏడు గమ్యస్థానాల నుండి చాలా ప్రత్యేకమైన ప్రమోషనల్ ధర కోసం విమానాలను బుక్ చేసుకోవచ్చు. చెన్నై, తిరుచిరాపల్లి, కొచ్చి, హైదరాబాద్, బెంగుళూ రు, కోల్‌కతా, త్వరలో త్రివేండ్రం నుంచి కౌలాలంపూర్‌కు కేవలం రూ. 4,999 తోనే ప్రయాణించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News