Saturday, May 4, 2024

అఖిలేశ్ యాదవ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోవడంలేదు!

- Advertisement -
- Advertisement -

Akhilesh
లక్నో: వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పోటీ చేయబోవడంలేదు.కాగా రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్‌ఎల్‌డి)తో తన పార్టీ పొత్తు పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ‘ఆర్‌ఎల్‌డితో మా పొత్తు ఖరారు అయింది. సీట్ల సర్దుబాటు కూడా ఖరారు కానున్నాయి’ అని ఆయన తెలిపారు. అఖిలేశ్ యాదవ్ ఆజంగఢ్ నుంచి పార్లమెంటు సభ్యుడు కూడా. తన పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా. అయితే ఆయన తాను ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోవడంలేదని స్పష్టం చేశారు.

అఖిలేశ్ యాదవ్ పినాన్న(అంకుల్) శివపాల్ యాదవ్ ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ లోహియ(పిఎస్‌పిఎల్)తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసే విషయం మాట్లాడరా అని ప్రశ్నించినప్పుడు ఆయన ‘ ఈ విషయంలో నాకెలాంటి సమస్యలేదు. ఆయనకు, ఆయన పార్టీ మనుషులకు సముచిత గౌరవాన్ని ఇస్తాను’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News