Monday, April 29, 2024

రోడ్డు ప్రమాదంలో కేరళ మాజీ మిస్, రన్నరప్ మృతి

- Advertisement -
- Advertisement -

Former miss kerala and runner died in car accident

తిరువనంతపురం: మాజీ మిస్ కేరళ, రన్నరప్ ఇద్దరు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంఘటన కేరళలోని ఎర్నాకులంలో జరిగింది. బైక్ ను తప్పించబోయిన కారు చెట్టుకు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..  2019లో అందాలలో పోటీలలో అన్సీ కబీర్ (25) మిస్ కేరళలో విజేతగా నిలవగా అంజనా షాజన్(26) రన్నరప్ గా నిలిచారు. అన్సీ తన ఇన్ స్టా గ్రామ్ ఆకౌంట్ లో ‘ఇట్స్ టైమ్ టు గో’ అంటూ ఫోటోను షేర్ చేసింది. కబీర్, అంజనాలు మరో ఇద్దరు స్నేహితులతో కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే కబీర్, అంజనాలు దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. షేర్ చేసిన కొంత సమయానికే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.  గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News