Friday, April 26, 2024

త్రివిక్రమ్ మాయ… బన్నీ విశ్వరూపం

- Advertisement -
- Advertisement -

‘అల వైకుంఠపురంలో’ చిత్రం గత ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. అల్లు అర్జున్ కెరీర్‌లో ఈ మూవీ ఒక మైల్ స్టోన్ సినిమాగా నిలిచింది. త్రివిక్రమ్ పదునైన డైలాగ్స్, తమన్ బాణీలు, అల్లు అరవింద్, చినబాబు నిర్మాణ విలువలు… ఇలా అన్నీ ఈ సినిమాను ఒక బ్లాక్‌బాస్టర్ సినిమాగా నిలబెట్టాయి. ఈ సినిమా విడుదలై ఏడాదైన సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో మీడియాతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, అల్లు అరవింద్, పూజా హెగ్డే, త్రివిక్రమ్, తమన్, సుశాంత్, సునీల్, నవదీప్, సముద్రఖని తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ “అల వైకుంఠపురంలో సినిమాకు త్రివిక్రమ్ టేకింగ్, తమన్ సంగీతం ప్రధాన బలం. 2020 నాకు బెస్ట్ ఇయర్. అలా వైకుంఠపురంలో సినిమా నాకు పెద్ద బూస్టప్ ఇచ్చింది. నా 20 ఏళ్ల కెరీర్‌లో ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది”అని అన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ “అల్లు అరవింద్ ఈ సినిమా కథ విని వెంటనే షూటింగ్‌కి వెళ్లిపోండని అన్నారు. అల వైకుంఠపురంలో సినిమా ఇంత గ్రాండ్ హిట్ అయిందంటే అందుకు అల్లు అర్జున్ ప్రధాన కారణమని చెబుతాను. బన్నీ ఈ సినిమాకు ఎంత చెయ్యగలడో అంతా చేశాడు. అలాగే తమన్ ప్రాణం పెట్టి సాంగ్స్ ఇచ్చాడు”అని పేర్కొన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ “ఈ సినిమా త్రివిక్రమ్ మాయ, బన్నీ విశ్వరూపం, తమన్‌కు జస్ట్ బిగినింగ్. ఈ కోవిడ్ సమయంలో ఈ సినిమా అందరికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది”అని తెలిపారు.

Ala Vaikuntapuram Movie Reunion Event

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News