- Advertisement -
మనతెలంగాణ,హైద్రాబాద్ : టీఎస్ ఐసెట్ తొలిదశ సీట్ల కేటాయింపు ఆదివారం జరిగింది. తొలిదశ సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీలోగా సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు కలిపి మొత్తం 26,845 సీట్లు ఉండగా, తొలి దశలో 19,209 సీట్లు కేటాయించారు. మరో 7,636 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో 28 కాలేజీల్లో 100 శాతం సీట్లు నిండినట్లు అధికారులు పేర్కొన్నారు. టీఎస్ ఐసెట్ -2021లో మొత్తం 51,136 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా, 21,811 మంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు 272 ఉన్నాయి. సీట్ అలాట్మెంట్ కాపీ కోసం https://tsicet.nic.in/default.aspx వెబ్సైట్ను సందర్శించవచ్చు.
- Advertisement -