Sunday, April 28, 2024

నమస్తే భారత్

- Advertisement -
- Advertisement -

MODI TRUMP

 

‘భారత్ అద్భుత అవకాశాలకు నెలవు.70 ఏళ్లలోనే ఒక అద్భుత శక్తిగా ఎదిగింది. భారత్ ఎదుగుదల ప్రపంచానికి ఒక మార్గదర్శకం. శాంతియుత, ప్రజాస్వామిక దేశంగానే ఎన్నో విజయాలు సాధించింది. మీ ఐక్యత ప్రపంచానికి స్ఫూర్తి, చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకొంటారు. సర్వమానవ సౌభ్రాతృత్వానికి ప్రతీకగా హోళీ జరుపుకొంటారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు అందరూ కలిసి జీవించే దేశం ఇది. వందకు పైగా భాషలతో అందరూ కలిసి మెలిసి జీవించే భారత్ ప్రపంచానికి ఆదర్శం. అమెరికాకు గుజరాతీలు అందించిన సేవలు ప్రశంసనీయం. గాంధీజీ ఆశ్రమాన్ని సందర్శించడం నాలో ఎంతో స్ఫూర్తిని నింపింది. మహాత్ముడిని స్మరిస్తూ రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తా’ : ట్రంప్

అహ్మదాబాద్: భారత్‌ను అమెరికా ఎంతగానో ప్రేమిస్తుందని, దాన్ని చాటి చెప్పేందుకే తాను 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్.. కార్యక్రమానికి విచ్చేసిన అశేష ప్రజలనుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ‘నమస్తే’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్ ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌తో 3 బిలియన్ డాలర్ల రక్ష ణ ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నామని ప్రకటించారు.‘ అంటే మాకు ఎంతో అభిమానం. దాన్ని చాటి చెప్పేందుకే మెలానియా, నేను 80 00 కిలోమీటర్లు ప్రయాణించాం. మోతేరా లాంటి అద్భుతమైన స్టేడియంలో ప్రసంగించడం గర్వం గా ఉంది. భారత్‌లో నాకు అద్భుతమైన స్వాగతం లభించింది. దీన్ని నేను, మెలానియా ఎప్పటికీ మరిచిపోం’ అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.

మోడీ అసాధారణ నేత
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ తనకు నిజమైన మిత్రుడంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మో డీ అసాధారణ నేత అని, భారత్ అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు ఎంతగానో కృషిచేస్తున్నారన్నారు. మోడీ గుజరాత్‌కు మాత్రమే ఆదర్శం కాదని.. శ్రమ, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని ఆ యన నిరూపించారన్నారు. ‘మోడీ జీవితం ఎం తో మందికి ఆదర్శం. ఒక చాయ్‌వాలాగా జీవితం ప్రా రంభించి స్థాయికి చేరుకున్నారు. ప్రపంచం లో అందరూ ఆయనను అభిమానిస్తారు. ఆయన చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. నా నిజమైన స్నే హితుడు మోడీ. అద్భుత విజేతగా దేశాభివృద్ధి కోస ం నిరంతరం శ్రమిస్తున్నారు. అయిదు నెలల క్రిత ం ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ స్టేడియంలో మోడీకి స్వాగతం పలి కాం. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంలో నాకు స్వాగతం పలికారు’ అని ట్రంప్ అన్నారు.

ప్రపంచానికే ఆదర్శం
‘భారత్ అద్భుత అవకాశాలకు నెలవు.70 ఏళ్లలోనే ఒక అద్భుత శక్తిగా ఎదిగింది. భారత్ ఎదుగుదల ప్రపంచానికి ఒక మార్గదర్శకం. శాంతయుత, ప్రజాస్వామిక దేశంగానే ఎన్నో విజయాలు సాధించింది. మీ ఐక్యత ప్రపంచానికి స్ఫూర్తి, చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకొంటారు. సర్వమానవ సౌభ్రాతృత్వానికి ప్రతీకగా హోళీ జరుపుకొంటారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు అందరూ కలిసి జీవించే దేశం ఇది. వందకు పైగా భాషలతో అందరూ కలిసి మెలిసి జీవించే భారత్ ప్రపంచానికి ఆదర్శం. అమెరికాకు గుజరాతీలు అందించిన సేవలు ప్రశంసనీయం. గాంధీజీ ఆశ్రమాన్ని సందర్శించడం నాలో ఎంతో స్ఫూర్తిని నింపింది. మహాత్ముడిని స్మరిస్తూ రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తా’అని ట్రంప్ అన్నారు.

పురుషులూ జాగ్రత్త!
దక్షిణాసియాలో భారత్ అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తోంది.ఇరు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇటీవలి కాలంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం 40 శాతం పెరిగింది. వేగవంతమైన సంస్కరణలతో మోడీ వాణిజ్య, వ్యాపార రంగాల్లో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. దేశాభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్త్తలు విప్లవాత్మక ప్రగతి సాధిస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళలు దూసుకొస్తున్నారు. పురుషులూ జాగ్రత్త ఉండండి అని ఆయన వ్యాఖ్యానించారు.

రక్షణ ఒప్పందం
‘ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం కొనసాగుతుంది. భారత్‌కు మరిన్ని అధునాతన సైనిక పరికరాలు, ఆయుధాలు అందించేందుకు అమెరికా ఎదురు చూస్తోంది.దీనికోసం మంగళవారం అమెరికా, భారత్‌ల మధ్య 3 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదరబోతోంది. రక్షణ రంగంలో భారత్‌కు అమెరికా అతిపెద్ద భాగస్వామిగా ఉండనుంది. ద్వైపాక్షిక బంధానికి నేను, మోడీ కృషి చేస్తాం’ అని ట్రంప్ అన్నారు.

ఉగ్రవాదంపై పోరు
ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను అడ్డుకునేందుకు భారత్, అమెరికాలు కలిసి కృషి చేస్తున్నాయి. ఇస్లామిక్ తీవ్ర వాదంనుంచి ప్రజలను రక్షించుకునేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి. ఇటీవలే మేము ఐసిస్ అధినేతను హతమార్చాం. అది చాలా గొప్ప విషయం. ఉగ్రవాద నిర్మూలనకు పాక్‌తో కలిసి పని చేస్తున్నాం. దీని వల్ల భారత్‌పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని ఆశిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రయాన్2 ప్రయోగాన్ని ప్రశంసించారు. ప్రపంచ శాంతి,ప్రజల ఆకాంక్షలకు రెండు దేశాలు శక్తివంతమైన రక్షకులుగా నిలవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.‘ ఈ సం దర్భంగా నేను చెప్పేది ఒక్కటే.. భారత దేశ గత వైభవానికి మీరందరూ గర్వపడాలి. భవిష్యత్తుకోసం ఏకమవాలి. స్వేచ్ఛ విలువల కోసం రెండు దేశాలు కలిసి నడవాలి. గాడ్ బ్లెస్ అమెరికా, గాడ్ బ్లెస్ ఇండియా, వి లవ్ ఇండియా వెరీ మచ్’ అం టూ ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించారు.

America loves India very much
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News