- Advertisement -
న్యూఢిల్లీ: బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి విమర్శలు గుప్పించారు. హోంశాఖ ఆదేశాల మేరకు బెంగాల్ లో సిఆర్పీఎఫ్ తృణమూల్ కార్యకర్తలపై దాడులు చేస్తూ ఎన్నికలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తుందని మమత చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఓటమి తప్పదనే నైరాశ్యంతో మమత ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. బెంగాల్ లో తొలి మూడు విడుతల్లో ఎన్నికలు జరిపిన 91 స్థానాల్లో బిజెపి 63 నుంచి 68 సీట్ల వరకు గెలుచుకుంటుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. చొరబాటుదారులను బెంగాల్ లోకి అనుమతించినందుకు, రాష్ట్రాన్ని దివాలా చేయించినందుకు మమతకు ఓటమి తప్పదన్నారు. మమతా బెనర్జీ పట్ల ప్రజలు విసిగిపోయారన్న షా కనీప పరిజ్జానం లేకుండా విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.
- Advertisement -