Tuesday, May 7, 2024

రైతులతో అమిత్‌షా చర్చలు విఫలం

- Advertisement -
- Advertisement -

Amit Shah's Talks With Farmer Leaders Fail

న్యూఢిల్లీ: రైతు సంఘాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారంనాడు రాత్రి అనూహ్యం గా జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దాదాపు మూడు గంటల పాటు జరిగిన చర్చల్లో ఇరు పక్షా లు కూడా తమ వైఖరిపై ఏ మాత్రం పట్టువీడకపోవడంతో ఎలాంటి పరిష్కారం లభించకుండా చర్చలు ముగిసినట్లు తెలిసింది. అయితే హోం మంత్రి అమిత్ షా మాత్రం వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వ ప్రతిపాదనలను లిఖితపూర్వకంగా బుధవారంనాడు అందజేస్తామని రైతు నేతలతో చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారంనాడు చర్చలు లేనట్టేనని తెలుస్తోంది. ఈ చర్చల్లో 13 మంది రైతు నేతలు పాల్గొన్నారు. మొదట అమిత్‌షా నివాసంలో చర్చలు జరుగుతాయని భావించిన పుసా జాతీయ వ్యవసాయ శాస్త్ర కాంప్లెక్స్‌కు మారిందని రైతునేతలు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News