Saturday, April 27, 2024

అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యం..

- Advertisement -
- Advertisement -

అగర్తల: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా త్రిపుర పర్యటనలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్ లోకి ఓ కారు వేగంగా దూసుకురావడం తీవ్ర అలజడి సృష్టించింది. అమిత్ షా అగర్తల ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారుల కథనం ప్రకారం… త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్‌సాహా ప్రమాణస్వీకార కార్యక్రమానికి అమిత్ షా బుధవారం హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగించుకుని తిరుగుపయనమవుతుండగా, భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం గెస్ట్‌హౌస్ నుంచి అగర్తల విమానాశ్రయానికి అమిత్‌షా కాన్వాయ్ వెళ్తుండగా, ఆ మార్గంలో అధికారులు సాధారణ ట్రాఫిక్‌ను నిలిపివేశారు.

అయితే ఓ వ్యక్తి మాత్రం ఆగకుండా తన కారులో ముందుకొచ్చాడు. పోలీసులు ఆ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించినా, అతడు వేగంగా కాన్వాయ్ లోకి దూసుకురావడం కలకలం సృష్టించింది. అయితే ఈ ఘటన కారణంగా ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. కాగా, దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనను కేంద్ర దర్యాప్తు సంస్థలు సీరియస్‌గా తీసుకున్నాయి. దీనిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News