Monday, May 6, 2024

ఎపిలో కొత్తగా 12వేలకు పైగా కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

AP Records 12615 fresh Corona Cases

అమరావతి: ఎపిలో మహమ్మారి కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మఖ్యంగా సంక్రాంతి పండుగ తర్వాత ఎపిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 47,420 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12,615 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 5మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో కోవిడ్-19 నుంచి 3,674 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఎపిలో ప్రస్తుతం 53,871 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

AP Records 12615 fresh Corona Cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News